telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ ఏనాడు అడ్డుపడలేదు: చంద్రబాబు

chandrababu

ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ కూడ అడ్డుపడలేదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కానీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అధికార పార్టీ నేతలకు అక్కసు ఎంత ఉందో తెలుస్తోందని చంద్రబాబు విమర్శించారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు ఇవ్వకుండా వెనక్కు వెళ్లింది. ఈ విషయమై అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన విమర్శలకు చంద్రబాబు వివరణ ఇచ్చారు.

రాజధాని అభివృద్దిని అడ్డుకొనేందుకు ఆనాడు వైఎస్ఆర్‌సీపీ నాయకులు లేఖలు రాశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ కారణంగానే ప్రపంచబ్యాంకు రుణాలను తీసుకొనేందుకు నిర్ణయించామని తెలిపారు.

Related posts