ప్రధానమంత్రి పదవికి ఏపీ సీఎం చంద్రబాబు సమర్ధుడని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని చంద్రబాబు చెప్పారు. తన నిర్ణయంలో ఏనాడూ మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
విపక్ష పార్టీల్లో ప్రధానమంత్రి అభ్యర్ధి విషయమై మోడీ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష పార్టీలన్నీ సమావేశమై ప్రధాన మంత్రి ఎంపిక విషయమై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. చర్చల ద్వారా ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకొంటామని తెలిపారు.