*రాజకీయ నేతలు పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు..
*హిట్ మ్యాన్ యాప్లో సుపారీ ఇచ్చినట్టు బెదిరిస్తున్నారు..
*నాపై ఆరోపణలు అవాస్తవం..నేను ఎవరికీ బినామి కాదు..
*రాజకీయ నేతలు, వ్యాపారాలు, సినిమా వాళ్లతో లీగల్ గా క్యాసినో ఆడించా..
*నేను ఏ తప్పు చేయలేదు
*టీడీపీ నేత పట్టాభి నా నెంబర్ చెప్పడంతో ..బెదిరింపు కాల్స్ ఎక్కువైయ్యాయి.
తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ఈడీ తనిఖీలతో దుమారం రేపిన క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు..
బుధవారం ఆయన కొన్ని మీడియా ఛానెళ్లతో మాట్లాడుతూ ..తనను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి చికోటి ప్రవీణ్ అన్నారు.
రాజకీయ నేతల పేర్లు చెప్పి క్యాసినోలతో సంబంధం ఉన్నట్లుగా ప్రకటించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఆ పేర్లు చెప్పకపోతే హిట్ మ్యాన్ అనే సైట్ ద్వారా తనను చంపేందుకు సుపారీ ఇచ్చినట్లుగా బెదిరిస్తున్నారని అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి మూడు నాలుగు కాల్స్ వచ్చాయని అన్నారు.
రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. టీడీపీ నేత పట్టాభి నా నెంబర్ వాళ్ల మీడియా బహిరంగంగా చెప్పడంతో .బెదిరింపు కాల్స్ ఎక్కువైయ్యాయని అన్నారు..
కాల్స్ ను రికార్డ్ చేసి, వాటిని ఫిర్యాదు సమయంలో ఆధారాలుగా చూపిస్తారా? అని ప్రశ్నించగా, వాట్సప్ ద్వారా కాల్స్ చేశారని, అవి రికార్డ్ అవ్వవని చెప్పారు. తనకు భద్రత ముప్పు ఉన్నందున ఇప్పటికే హైకోర్టులో రిట్ వేశానని, దానిపై ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ఈ కేసు ఎంక్వైరీ దశలో ఉన్నందున తాను ఎక్కువగా దాని గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పారు. ఇప్పటిదాకా తాను నేపాల్, గోవాలో నిర్వహించిన క్యాసినోలను లీగల్ గానే నిర్వహించినట్లుగా చెప్పుకొచ్చారు.ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పానని, హవాలా లావాదేవీలతో తనకు సంబంధం లేదన్నారు.
ఈ క్యాసినోలకు ప్రమోషన్స్ షోస్ కోసం సెలబ్రిటీలు హాజరవుతారని తెలిపారు. రాజకీయ నాయకుడైనా, సెలబ్రిటీ అయినా ఎవరికైనా ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుందని అన్నారు. అంతేకానీ, తాను ఎవరికీ బినామీగా లేనని, తనకు ఆ అవసరం లేదని అన్నారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పానని, హవాలా లావాదేవీలతో తనకు సంబంధం లేదన్నారు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్తాను అని వెల్లడించారు
చంద్రబాబు, కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు గ్రహణం: బండారు దత్తాత్రేయ