telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు, కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు గ్రహణం: బండారు దత్తాత్రేయ

BANDARU DATTATREYA

తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగురాష్ట్రాలకు గ్రహణంలా పట్టారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. నిజామాబాద్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి మరికొంత మంది లోక్ సభ సభ్యులు త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రకటించారు. టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని దత్తాత్రేయ విమర్శించారు. కరీంనగర్ లో బి.వినోద్, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఓటమితో టీఆర్ఎస్ పతనం మొదలైందని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని ప్రాజెక్టుల కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Related posts