హైదరాబాద్ బంజారాహిల్స్ లో అర్ధరాత్రి మందుబాబులు రెచ్చిపోయారు.రోడ్డుపై వెళ్ళేవారిని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడి చేశారు. రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన వాహనాలపై రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని ఉదయ్నగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ అలీ, వెంకటేశ్తో పాటు మరికొంతమంది పక్కనే ఉన్న సింగాడికుంటలోని బెల్ట్షాపులో మద్యం కొనుగోలు చేసి రోడ్లపై కూర్చుని తాగుతుంటారు.
ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడులు చేయడం, డబ్బులు లాక్కోవడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటోలో కూర్చున్న మహ్మద్ అలీ, వెంకటేశ్తో పాటు మరికొంతమంది బీభత్సం సృష్టించారు. దారినపోయే వారిని చితకబాదడంతో పాటు రోడ్డుపక్కన పార్క్ చేసిన కారును ధ్వంసం చేశారు.అలాగే రెండు ఆటోలను ధ్వంసం చేశారు. అదే రోడ్డుపై పార్క్ చేసిన బైక్లను కిందపడేశారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని చంపేస్తామంటూ హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహ్మద్ అలీని అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి