telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

10 రోజులు వైకుంఠ దర్శనాలు చేసుకోవచ్చు: చినజీయర్ స్వామి

china jiyar swamy

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు స్వామివారు వైకుంఠ ద్వారం గుండా వచ్చి వెళ్తారని చినజీయర్‌స్వామి చెప్పారు. ఈ పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ దర్శనాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఉత్సవమూర్తులకు అభిషేకాలు తగ్గించుకోవాలని ఆలయ వర్గాలకు సూచించారు.

ఎక్కువ అభిషేకాలతో ఉత్సవమూర్తులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. ఏడాదికి 45 అభిషేకాలు చేస్తే సరిపోతుందని చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. ఈ నెల 16 నుంచి 30 వరకు అమెరికాలో చినజీయర్ స్వామి ప్రత్యేకంగా ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గుంటూరులో జనవరి 1 నుంచి 15 వరకు ధనుర్మాస పూజలు చేయనున్నారు. 

Related posts