telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 4జీ.. ఏపీలో నేడు ప్రారంభం!

bsnl monsoon offers for prepaid customers

ప్రైవేటు టెలికాం కంపెనీలు శరవేగంతో 4జీ సేవల్లో దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 4జీ సేవలను అన్నిరాష్ట్రాల్లో ప్రారంభించనుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆ సంస్థ ఏపీలో 4జీ సేవలను లాంఛనంగా ప్రారంభించింది.

ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇవాళ్టి నుంచి 4జీ సేవలను ప్రారంభించగా.. అందుకుగాను ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 350 టవర్లను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే 3జీ వాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తమ సిమ్ కార్డులను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో 4జీకి అప్‌గ్రేడ్ అయిన కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత డేటా కూడా అందిస్తోంది.

Related posts