దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దీంతో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. కరోనాతో మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వృద్దుడు గత రాత్రి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ఈ రోజు తెలిపారు.దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది.
మృతునికి మదుమేహం, రక్తపోటు తదితర వ్యాధులున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. మహారాష్ట్రలో ఈ రోజు ఒక్కరోజే పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 74కు చేరింది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.