దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కూడా ప్రజలకు టెన్షన్ పెడుతోంది.. .కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతుండంతో కలవరానికి గురిచేస్తుంది.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి మరోసారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని .. నిర్ధారణ పరీక్షలు చేయించగా.. పాజిటివ్ అయినట్లు ఆయనే స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.కొవిడ్ మహమ్మారి, ఒమిక్రాన్ వేరింట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ కోరారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన పడొద్దని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. గతేడాది మార్చిలోనూ రేవంత్కు కరోనా సోకింది.