తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన పి.శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగానే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. తన భార్య గీతిక కొన్ని రోజులుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్ పల్లిలోని తన పుట్టింట్లో ఉంటోంది.
మరో వ్యక్తితో కలిసి వచ్చిన శ్రీనివాస్ తన భార్యను హతమార్చబోయాడు. దీంతో మేనమామ రాజిరెడ్డికి బుల్లెట్లు తగిలడంతో తీవ్రగాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గీతికకు ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. శ్రీనివాస్ వద్ద నుంచి తుపాకీ, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ దర్యాప్తు చేపట్టారు.
సుజనా బంధువులకు 124 ఎకరాలు.. భూముల చిట్టావిప్పిన బొత్స