సీఎం కేసీఆర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. అమరవీరులకు… మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉండాలనుకోవడం గొప్ప విషయమని నితీష్ కుమార్ అన్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ తమ కార్మికులకు ఇలాంటి సాయమే అందాలని ఆకాంక్షించిన నితీశ్ అమరుల కుటుంబాలకు కేంద్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని నితీశ్ పిలుపునిచ్చారు.
ఎవ్వరూ చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారని బీహార్ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కి కేసీఆర్ది ప్రత్యేకమైన పాత్రన్నారు. కేసీఆర్ రాష్ట్ర విభజన కోసం పోరాడి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణకు ఉపాధి కోసం వెళ్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ ఎంతో ఉదారత చూపిస్తున్నారన్నారు.
కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. ఆయన్ను కాదనుకునే వారంటూ ఎవరూ ఉండరంటూ కొనియాడారు.
మిషన్ భగీరథ పథకం.. సామాన్యమైన విషయం కాదన్నారు. రెండు నదుల నీళ్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. కేసీఆర్ ఇలా ఎలా అభివృద్ధి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని తమ బృందాన్ని పంపామన్నారు.
కేసీఆర్ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్