బెనెల్లీ తన లేటెస్ట్ బైక్ లియోన్సినో 250ని భారత్లో విడుదల చేసింది. రూ.6,000 చెల్లింపుతో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సొమ్ము పూర్తిగా రిఫండబుల్ అని బెనెల్లీ తెలిపింది. ఆన్లైన్ ద్వారా కానీ, బెనెల్లీ డీలర్షిప్స్ వద్ద కానీ బుకింగ్స్ చేసుకోవచ్చు. గ్రే, వైట్, రెడ్, బ్రౌన్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.
లెయోన్సినో 500తో పోలిస్తే లియోన్సినో 250 డిజైన్ అద్భుతంగా ఉంది. చూడడానికి రెండు ఒకేలా అనిపించినా సీటు కింది స్టీల్ ఫ్రేమ్, సస్పెన్షన్, స్విన్గ్రామ్ వంటివి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అలాగే, 249 సీసీ ఇంజిన్, ఆరు గేర్లు, అన్నీ ఎల్ఈడీ లైట్లు, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానల్ ఏబీఎస్, 41 ఎంఎం అప్సైడ్ డౌన్ ఫోర్క్ అప్ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్ ఉన్న ఈ బైక్ ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 12.5 లీటర్లు. 162 కిలోల బరువున్న ఈ బైక్ ధర రూ.2.5 లక్షలు.
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…