telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఈ నెల 26, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి: ఉద్యోగ సంఘాలు

all banks

జాతీయ బ్యాంకులన్నీ ఈ నెల 26, 27 తేదీల్లో యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. ఉగాది, వారాంతపు సెలవు దినాలతోపాటు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు బ్యాంకులు మూతపడుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 25వ తేదీన ఉగాది, 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. దీనికి అదనంగా 26, 27 తేదీల్లో ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తేనే ఏటీఎంల్లో డబ్బులుండవు. అటువంటిది వరుసగా ఐదు రోజులు సెలవులంటే ఇబ్బందేనని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 26, 27 తేదీల్లో సమ్మె జరిగే అవకాశం లేదని, ఒకవేళ సమ్మె చేసినా బ్యాంకులు తెరిచే ఉంటాయని ఉద్యోగుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Related posts