telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

Crime

ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఏపీలో రైతులు విత్తనాల కోసం పలు జిల్లాలో ఆందోళన చేసుతున్న సంగతి తేలిందే. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయవల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్న క్రమంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాకు చెందిన రైతు కురుబ సుబ్బారాయుడు (49) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ మండలంలోని ఆమిద్యాలకు చెందిన సుబ్బారాయుడు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి వెళ్లి అక్కడ పురుగుమందు తాగాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా ఘటనలపై వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts