telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హిందువులను ఓటు బ్యాంకు గా మారుద్దాం : బండి సంజయ్

రాక్షస పాలన అంతం చేసి గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేద్దాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుదాం.. లాక్ డౌన్ కి మోడీ పిలుపు నిస్తే దేశ ప్రజలు అండగా నిలిచి సహకరించారు. నడ్డా పిలుపు మేరకు బీజేపీ కార్యకర్తలు సేవ కార్యక్రమాలు చేశారు.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు కరోన భారిన పడి కార్యకర్తలు మరణించారు. ప్రజల్ని కరోన సమయంలో వదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా పోయాడు. ఆయుస్మాన్ భారత్ ని చులకన చేస్తూ అమలు చేయకపోవడం వల్ల పేద వారికి కరోన కార్పోరేట్ వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు, మరణించారు. సీఎం మాత్రం మూర్ఖంగా వ్యవహరించారు.. ఆత్మ స్టైర్యం నింపే ప్రయత్నం చేయలేదు.. ఫార్మ్ హౌస్ కు పోయే దారిలో భారత్ బయో టెక్ ఉంటే కనీసం సీఎం పోలేదు.. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు… లాక్ డౌన్ టైమ్ లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు పిలిచాడు సారు కారు 16 అన్నారు.. కారు పంక్చర్ అయింది.. మోడీ కార్యక్రమాలు చూసి రాష్ట్రం లో బీజేపీ కి అధికారం ఇవ్వాలని ప్రజలు బావిస్తున్నారు. కాంగ్రెస్ , తెరాస లో నిఖార్సైన హిందువులు ఉన్నారు.. అయోధ్య లో రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తార లేదా స్పష్టం చేయాలి. ధనిక రాష్ట్రం తెలంగాణ ని అప్పుల రాష్ట్రం గా మార్చిన కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం పోయింది. సెక్రటేరియట్ కి రాని సీఎం గా రికార్డ్ సాధించారు.. రజాకార్ల వారసులను ప్రగతి భవన్ లో పక్కన కూర్చోబెట్టుకొని పాలన చేస్తున్నారు. 13 వేల 500  కంపెనీ లు వస్తే, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ముఖ్యమంత్రి కి పూజ చేస్తా.. శ్వేత పత్రం విడుదల చేయాలి… లేకుంటే బడితే పూజ చేస్తాం. డబల్ బెడ్ రూమ్ ల పేరుతో సీఎం ప్రజల్ని మోసం చేస్తున్నారు. కుల వృత్తులను నాశనం చేస్తున్నారు.. కులాల పేరుతో విభజన చేస్తున్నాడు. ముస్లిం లను బీసీ ల లో చేర్చడం వల్ల వారు నష్టపోతున్నారు.. వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటున్నాడు. అన్ని మాఫియా లకు అడ్డాగా ప్రగతి భవన్ మారింది… రాష్ట్రం లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే.. పోలీస్ లను అడ్డం పెట్టుకొని బీజేపీ ని ఆపాలని సీఎం ప్రయత్నం చేస్తున్నాడు..అక్రమ కేసులతో బీజేపీ ని అడ్డుకోలేవు… అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం…త్యాగాలు చేసే పార్టీ లో మనం ఉన్నాం.. హిందువులను ఓటు బ్యాంకు గా మారుద్దాం. తెలంగాణ తల్లిని కేసీఆర్ కబంధ హస్తాల నుండి విముక్తి చేద్దాం అని అన్నారు.

Related posts