బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విపక్షాల నుంచి కాపాడేందుకే లోక్ సభలో బీజేపీ సభ్యులు కావాలనే రభస చేశారని రాహుల్ ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను మాట్లాడడం బీజేపీ నేతలకు ఎంతమాత్రం ఇష్టంలేదని ఈ ఘటనతో వెల్లడైందని అన్నారు.
వాయనాడ్ లో వైద్య కళాశాల లేకపోవడంతో, దాని ప్రాధాన్యతను వివరించేందుకు ప్రయత్నించానని, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఎవరిపైనా దాడి చేయలేదని, ఆయనపైనే దాడి జరిగిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అందుకు ఆధారంగా ఫుటేజ్ కూడా ఉందని వెల్లడించారు.
నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్