telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు: మంత్రి పేర్ని నాని

perni nani minister

అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారన్నారు.

ఆర్టీసీ విలీనం సాధ్యమవుతుందా అనే వాళ్ళకు జగన్ విలీనం చేసి చూపించారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్టీసీని నాశనం చేశారని విమర్శించారు. జగన్ అధికారంలోకి రాగానే దానికి జీవం పోశారని అన్నారు. జగన్ ది మాట ఇస్తే నిలబెట్టుకునే ధృడ సంకల్పమని అన్నారు.

Related posts