telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పశువులు, గొర్రెల పంపిణీ…

మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ… రూ. 5,386 కోట్లను పాడి పశువులు, గొర్రెల కొనుగోలుకు కేటాయించాం అని అన్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వీటిని పంపిణీ చేస్తాం అని తెలిపారు. పెద్ద ఎత్తున ఈ పథకానికి డిమాండ్ వస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశువులను కొనుగోలు చేస్తాం అని చెప్పిన ఆయన మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. ముర్ర జాతి , మేలు రకమైన పశువులను కొనుగోలు చేస్తాం. లక్ష పశువులను కొనుగోలు చేస్తాం అన్నారు. అయితే రెండున్నర లక్షల మంది గొర్రెలు, మేకల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్ 75 వేలు, అదనంగా కాపరులకు కిట్ ఇస్తాం అని చెప్పారు. అమూల్ సంస్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒప్పందం చేసుకున్నాం. నవంబర్ 26న ఏపీ అమూల్ ప్రారంభిస్తాం అన్నారు. ఈ రోజు నుంచే పాల సేకరణ ప్రారంభమైంది. ఏపీ అమూల్ పై కొన్ని పత్రికలు బురద జల్లుతున్నాయి. 9688 కేంద్రాల్లో మహిళల ద్వారా పాల సేకరణ చేస్తాం. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో మహిళలతో సహకార సొసైటీ పెట్టిస్తున్నాం అని తెలిపారు. ఇక ప్రతి ఆర్బీకేలో పాల సేకరణకు అవసరమైన సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇందుకోసం రూ. 1362 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పాలపై లీటరుకు అదనంగా రూ.4 కంటే ఎక్కువ రైతుకు దక్కేలా చేస్తాం. మార్కెట్టులో పోటీ వాతావరణం కల్పించి రైతుకు అధిక ధర వచ్చేలా చేస్తాం. అందుకే ఏపీ అమూల్ ప్రాజెక్టును తెచ్చాం అని అన్నారు.

Related posts