telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ హైకోర్టులో విచారణ

ap high court

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐతో పాటు రిలయన్స్, వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని పేర్కొంది.

ఏపీలో విపక్ష నేతలతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అధికార వైసీపీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణ చేపట్టి 16 మందికి నోటీసులు జారీ చేసింది.

Related posts