మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు.
ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఈ నేపథ్యం లో `ఆచార్య` చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. `ఆచార్య` చిత్రానికి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్నికల్పించింది. విడుదలైన రోజు నుంచి పది రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. టికెట్పై యాభై రూపాయలు పెంచుకునే వెసులుబాటుని కల్పించింది.
మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్స్, రీక్లైనింగ్ సీట్స్ కలిగిన థియేటర్స్ రూ. 50 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
రూ.100 కోట్ల నిర్మాణ వ్యయం దాటిన చిత్రాలకు టిక్కెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది.
జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఐదో షో విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.