లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చిన్నారులకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా ఇచ్చే రోగ నిరోధక టీకాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ వారికి టీకాలు వేయనున్నారు. టీకాలు వేసే ప్రదేశాలను వెల్లడించింది. కరోనా ప్రభావిత రెడ్ జోన్ మినహా సబ్ సెంటర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, ఈయూ పీహెచ్సీల్లో టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టీకాలను ఆశా వర్కర్లు వేస్తారని చెప్పింది. వాళ్లు టీకాలు ఇచ్చే సమయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేస్తారని తెలిపింది. ఆయా కేంద్రాల్లో ప్రతి 30 నిమిషాల్లో నలుగురికి మాత్రమే టీకాలు ఇస్తారని, ఇందుకోసం వారికి ముందుగానే స్లాట్స్ను కేటాయిస్తారని చెప్పింది. టీకాలు ఇచ్చే సమయంలో వారి మధ్య సామాజిక దూరం పాటిస్తారని ప్రభుత్వం తెలిపింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే విచారణ జరపాలి: చంద్రబాబు