అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం భజన చేసే ప్రజా ప్రతినిధులు కాస్త పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.
రాజకీయ, సామాజిక పరిజ్ఞానంలో కొంతయినా వైసీపీ ప్రభుత్వానికి ఉంటే బాగుండును అనిపిస్తోంది’ అంటూ ఓ యువకుడివీడియో పోస్ట్ చేశారు. ‘రాజధాని అన్న పదమే రాజ్యాంగంలో లేదని జగన్ అన్నారు. మరి మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అమరావతిని రాజధానిగా గతంలోనే ప్రకటించారు. మరి ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల ప్రకటన చేయడమేంటీ? అని ప్రశ్నించారు.
వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి