telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో మూడేళ్లు పూర్తయింది. రాష్ట్ర చరిత్రలోనే అతి భారీ మెజారిటీ సాధించి సీఎం కుర్చీ సాధించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. . ఈ సందర్భంగా.. ఆయన ప్రజానీకాన్ని ఉద్దేశించి జ‌గ‌న్ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు.

మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశామ‌ని అన్నారు. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని, రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు..

మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాఅని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Related posts