విశాఖ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . పార్టీ జెండాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ చారిత్రాత్మకమైన పార్టీ అని అన్నారు.
ఏపీలోనూ బలమైన శక్తిగా ఎదుగుతామని అన్నారు. దేశ రాజకీయాలలో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించింది. జాతీయ భావాలతో పనిచేస్తా మని అన్నారు. బీజేపీ ఈ దేశానికి చారిత్రక సోము వీర్రాజు అవసరం అన్నారు.
రేపటి నుండి ఈనెల 20 వరకు రాష్ట్రం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. మా పొత్తు వ౦ద కోట్ల మ౦ది ప్రజలు, జనసేన తోనే అన్నారు.
ఏ మార్పులు జరిగినా అది బీజేపీ వలనే సాధ్యం అవుతుందన్నారు సోము వీర్రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలనేది ఏపీ బీజేపీ నిర్ణయ మని అన్నారు.. మైన్స్ పాలసీ దేశవ్యాప్తంగా మారుతుంది.
పెట్రోల్, డీజిల్ పై మేము పది రూపాయలు తగ్గించామని, అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని సోము వీర్రాజు వెల్లడించారు. . పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శోభాయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.
ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలే.. జగన్ పై లోకేశ్ విమర్శలు