telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి: నాగబాబు ట్వీట్

Nagababu

శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల తిరుమతి శ్రీవారి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు. కొన్ని రోజులుగా నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఆస్తులు వేలం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Related posts