telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసుల ముందు విచారణకు హాజరైన అనురాగ్‌

Anurag-Kashyap

నటి పాయల్‌ ఘోష్‌ ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని, తనను రూమ్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని పాయల్ ఘోష్ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసింది పాయల్ గోష్‌. తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అయితే పోలీసులు ఐపిసి సెక్షన్ 376 354 341 342 కింద పోలీసులు అనురాగ్ పై కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. దాంతో ఈరోజు ముంబై పోలీసుల ముందు విచారణకు అనురాగ్‌ హాజరయ్యారు. మరి ఈ విచారణలో పోలీసులు ఎటువంటి నిజాలను బయటికి తెస్తారో చూడాలి. మంచు మనోజ్ ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పాయల్ ఇటీవల సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Related posts