telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగమైన అనుపమ పరమేశ్వరన్

Anupama

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఇచ్చిన ఛాలెంజ్ ను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్వీకరించింది. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు కొనసాగాలని అందరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మరొక 12 మందిని మొక్కలు నాటాలని ఛాలెంజ్ లో కోరింది అనుపమ. వారిలో కాళిదాస్ జయరామ్, నివితా థామస్, ఆహన కృష్ణ, రాజీష్ విజయాన్, పద్మ సౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాకు ఉన్నారు. తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న ఫోటోలను అనుపమ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.తాను గత కొన్ని రోజుల క్రితమే 25 మొక్కలు నాటడం జరిగిందని, అందులో 23 మొక్కలు మంచిగా బతికాయని, రెండు మొక్కలు మాత్రం చనిపోవడం జరిగిందని, ఇంతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నాకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అని తెలిపింది అను. చాలా సంతోషంగా ఈ చాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మా ఇంటి ఆవరణంలో ఒక మొక్క నాటడం జరిగిందని, మా ఇంటి ఆవరణంలో ఎక్కువ ఖాళీ స్థలం లేని కారణంగా ఒక మొక్కను మాత్రమే నాటడం జరిగిందని, తప్పకుండా నేను ప్రమాణం చేస్తున్నాను మిగతా మొక్కలను కూడా త్వరలోనే నాటడం జరుగుతుందని తెలిపింది.

Related posts