సినీ నటుడు చిరంజీవి ఇంట్లో సీసీసీ సభ్యుల సమావేశం ముగిసింది. మరోసారి సమావేశం కావాలని సభ్యులు నిర్ణయించారు. మొదటి విడత సాయం అందని వారికి రెండో విడతలో సాయం అందజేయాలని చిరంజీవి చెప్పారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బాలయ్య వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. అవసరం ఉన్నవాళ్లని పిలిచి ఉంటారని, బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళతారని చెప్పారు. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమని చెప్పారు. సీసీసీ సమావేశంలో ఇవేవి చర్చకు రాలేదని తమ్మారెడ్డి చెప్పుకురావడం కొసమెరుపు. సినీ నిర్మాత సి. కళ్యాణ్ బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఫ్లోలో అలా అన్నారో తనకు తెలియదని, సీఎం కేసీఆర్ చెప్పిన వారినే పిలిచారని తాను భావిస్తున్నానని చెప్పారు. తొలివిడత పంపిణీపై రివ్యూ మీటింగ్ జరిగిందని నటుడు బెనర్జీ తెలిపారు.
next post
జైకి ఇంకా పెళ్ళి కాలేదు… తమిళ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటా… : అంజలి