telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెట్టును కొట్టేసినందుకు 42 కోట్ల జరిమానా…!?

Court-Order

కాలిఫోర్నియాలో ఓ చెట్టును కొట్టేసిన  జంటకు భారీ జరిమానా పడింది. 180 ఏళ్ల ఆ ఓక్ ట్రీ చుట్టుపక్కల ప్రాంతాన్ని తవ్వేసిన వారు.. ఇంటి నిర్మాణం చేపడదామని అనుకున్నారు. దీనికోసం వారు జరిపిన తవ్వకాల వల్ల ఈ చెట్టు వేర్లు దెబ్బతిన్నాయని కోర్టు అనుమానిస్తోంది. అలానే మరో చారిత్రాత్మక నిర్మాణాన్ని కూడా వీరు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో కోర్టుకెక్కిన ఈ కేసులో తీర్పిచ్చిన న్యాయస్థానం.. చారిత్రక విలువగల నిర్మాణాలు, స్థలాలను నాశనం చేయడానికి ప్రవర్తించే వారిని క్షమించేదిలేదని పేర్కొంది. ఈ నేరానికి పాల్పడినందుకుగానూ ఆ దంపతులకు సుమారు రూ.42 కోట్ల జరిమానా విధించింది. అయితే ఈ కేసుపై తాము ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని ఆ దంపతులు చెప్పారు.

Related posts