telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆది సినిమా నుండి విడుదలైన పాట…

Shashisathri

చాలా రోజులుగా ఓ హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న హీరో సాయి కుమార్ కుమారుడు ఆది. సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం అందడంలేదు. చెప్పుకోదగ్గ హిట్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది నటించిన సినిమా శశి. ఈ సినిమా శ్రీనివాస నాయుడు దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సరసన బ్యూటీ సురభి హీరోయిన్‌గా కనిపించింది. ఇటీవల ఈ సినిమా నుంచి ఒకే ఒక లోకం నువ్వే అనే పాటను విడుదల చేశారు. దానికి సంబంధించి నేడు ఈ సిట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన పదాలతో పాటను రాశారు. దానికి తన స్వరంతో ప్రాణం పోశాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఎంతో గొప్పగా అద్భుతంగా ఆలపించాడు. ఈ పాట లిరిక్స్‌లో హీరో ఆది హీరోయిన్‌ను ఎంతలా ప్రేమిస్తున్నాడన్న దాన్ని కళ్ళకుకట్టినట్టు చూపించాడు. ఈ పాట ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఈ పాట సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది. చూడాలి మరి ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts