టీం ఇండియాను గాయాల బెడద వదలడం లేదు. ఆసీస్ టూర్ సిద్ధమైన తర్వాత నుండి ఒక్కో మ్యాచ్ కు ఒక్కో ఆటగాడు గాయం బారిన పడుతున్నాడు. అయితే అందులో కొందరు తిరిగి వచ్చిన చాల మంది ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమయ్యారు.అయితే తాజాగా ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది.. సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్కు గాయం కావడంతో.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.. శనివారం జరిగిన టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లో ఎం.సి.జి వద్ద నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎడమ మణికట్టు బెణకడంతో గాయపడ్డాడు రాహుల్.. దీంతో రాహుల్.. బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు అందుబాటులో ఉండబోడని బీసీసీఐ ప్రకటించింది.. రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి, ఫిట్నెస్ సాధించడానికి మూడు వారాల సమయం అవసరం అని.. దీంతో.. అతను ఇప్పుడు భారత్కు తిరిగి వస్తారని.. తర్వాత రీ ఎంట్రీ ప్రాక్టీస్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని ఓ ప్రకటనలో తెలిపింది బీసీసీఐ. మొత్తంగా ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
previous post