telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు: టీడీపీ ఎంపీ కేశినేని నాని

Nani kesineni

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల పై టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని నాని స్పందించారు. .ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. విజయవాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పై 8,183 ఓట్ల ఆధిక్యంతో కేశినేని నాని విజయం సాధించారు.

ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయని అన్నారు. ఓటమికి గల కారణాలపై, ఐదేళ్ల పాలనపై విశ్లేషించుకుంటామని చెప్పారు. ప్రజలు తమ నుంచి ఇంకా ఏదో ఆశించారని అభిప్రాయపడ్డారు. బెజవాడను.. నన్ను విడదీసి చూడలేరని అన్నారు. అందుకే అక్కడి ప్రజలు మళ్లీ గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు.

Related posts