telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

పాక్ లో మరో హిందూ దేవాలయం కూల్చివేత…

పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయాన్ని కూల్చేశారు. అయితే ఇప్పటికే పాక్ లో అనేక హిందూ ఆలయాలను కూల్చివేశారు అనేది  అందరికి తెలిసిందే. అక్కడ ఇప్పటివరకు  ఒక్క కొత్త దేవాలయం కూడా నిర్మించలేదు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో ఆలయాలపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైనట్టు లండన్ బేస్డ్ పాకిస్తానీ యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ పేర్కొన్నారు.  సింధ్ ప్రావిన్స్ లోని బాదిన్ ఏరియాలో రామ్ మందిర్ ను ఈనెల 10వ తేదీన కూల్చినట్లు తెలుస్తుంది.  దీనిపై ఫిర్యాదులు హిందూ సంఘాలు ఫిర్యాదులు చేసిన పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె  తెలిపింది. అయితే సింధ్ ప్రావిన్స్ లో గతంలో 428 హిందూ ఆలయాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 20 కి పడిపోయిందని, భవిష్యత్తులో ఈ మందిరాలు కూడా ఉంటాయనే నమ్మకం లేదని అనిలా గుల్జార్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడులు మరింత ఎక్కువైనట్టు ఆమె తెలిపారు. ఇక ఈ మధ్యే భారత్ లో  బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోశులైతే  అని తీర్పు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts