telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,891 మందికి పాజిటివ్‌

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఆసుపత్రుల్లో 18,547 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 47,590 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 540కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 517 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.

Related posts