telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పట్టాలెక్కనున్న ప్రైవేటు రైళ్లు!

trains Indian railways

దేశంలోని పలు మార్గాల్లో ప్రైవేటు ప్యాసింజర్ రైళ్లను నడిపించేందుకు రంగం సిద్దమైంది. మొత్తం 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఆహ్వానిస్తూ ఇండియన్ రైల్వేస్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్యాసింజర్ రైళ్ల విషయంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీని ద్వారా రూ. 30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత సంవత్సరమే తొలి ప్రైవేటు రైలుగా ఢిల్లీ – లక్నో మార్గంలో తేజస్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై వారణాసి – ఇండోర్ మధ్య కాశి మహాకాళ్ ఎక్స్ ప్రెస్, అహ్మదాబాద్ – ముంబై మార్గంలో మరో తేజస్ ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కాయి. వీటిని ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు దగ్గరవుతాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

Related posts