telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గురుదాస్ గుప్తా మృతి పట్ల చంద్రబాబు సంతాపం

chandrababu

మాజీ లోక్‌సభ ఎంపీ, సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. గుప్తా మరణవార్త తనను తీవ్ర విచారానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. వామపక్ష నేతగానే కాకుండా, కార్మిక సంఘాల నేతగా దాస్ గుప్తా ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని ఆన్నరు.

దాస్ గుప్తా ప్రసంగాలు ఎంతో శక్తిమంతంగా ఉండేవని కొనియాడారు. ట్రేడ్ యూనియన్లను బలోపేతం చేయడంలోనూ, యూనియన్ సభ్యుల హక్కుల సాధనలో ఆయనకు ఆయనే సాటి అని కీర్తించారు. ఈ విషాద సమయంలో దాస్ గుప్తా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts