telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పంజాబ్‌లో దారుణం..మైనర్ బాలికను..

rape

నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు దారుణానికి గురవుతున్నారు. అయితే ఇటీవల పాకీస్తాన్‌లో ఇటువంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను అపహరించారు. కూతురు ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందారు. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. అయితే అమ్మాయిని కిడ్నాప్ చేసిన 45 సంవత్సారాల వ్యక్తిని పెళ్ళి చేసుకోమని బలవంతం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాకీస్తాన్‌లోని పంజాబ్‌ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. అయితే అమ్మాయి వయసు 17గా నమోదు కావడంతో విచారణ కొనసాగించమని కోర్టు తెలిపింది. దాంతో అమ్మాయి తండ్రి పై అధికారుల వద్దకు వెళ్ళాడు. అయితే పాకీస్తాన్‌లో ఇటువంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో 13 సంవత్సారాల అర్జూ రాజా అనే క్రైస్తవ అమ్మాయిని 44 సంవత్సారాల వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకొని ఇస్లాం మతంలోకి మార్చేశారు. తరవుతు మానవహక్కు సంఘాలు రాజాకి న్యాయం జరగాలని కోరాయి.

Related posts