*ఏపీ మంత్రుల తుది జాబితా
*25మందితో ఏపీ కొత్త కేబినేట్..
*కొత్త, పాత కలయికతో 25 మందితో మంత్రి వర్గం కూర్పు
ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ పై ఉత్కంఠకు తెర పడింది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ న్యాయం పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రేపు (ఏప్రిల్ 11) జరగనుంది.ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది.