telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విరాళంగా బంగారు గాజులు.. ప్రశంసించిన చంద్రబాబు

tdp chandrababu

అమరావతి రాజధాని పరిరక్షణ సమితికి నగదుతో పాటు నగల రూపంలో పలువురు విరాళాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావం తెలపడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బంగారు గాజులను తీసి ఆయనకు విరాళంగా అందించింది.

అనంతరం పలువురు నేతలు, రైతులు, మహిళలు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి కోసం చంద్రబాబుకు తమకు తోచిన విధంగా నగదును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు ప్రశంసించారు. రైతులు ఎన్నో త్యాగాలు చేసి అమరావతి కోసం భూములు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు రాజధానిని తరలిస్తాననడం సరికాదని విమర్శించారు.

Related posts