telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వృద్ధులను వేధించేందుకు సీఐడీ పోలీసులు: పంచుమర్తి అనురాధ

Anuradha Tdp

వృద్ధులను వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం సీఐడీ పోలీసులను వాడుతున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా వేధిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా అంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టును షేర్ చేస్తే… వయసు కూడా చూడకుండా వేధిస్తారా? అనినిలదీశారు.

అన్ని వ్యవస్థలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. 12 మంది ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ ను మంచి కంపెనీ అని చెప్పిన జగన్… సమాజ సేవ చేస్తున్న వృద్ధురాలిని క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ లీక్ ఘటనలో పాపను కోల్పోయిన తల్లి ప్రశ్నిస్తే… ఆమెపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు.

Related posts