telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

16జిల్లాల ఏపీకి … రంగం సిద్దమేనా..

ap map

13 జిల్లాలుగా ఉన్న ఏపీ అతి త్వరలో 16 జిల్లాల రాష్ట్రంగా మారనుందట..ఎందుకంటే ఆఘమేఘాలపై 3 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే… 3 కొత్త జిల్లాల ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఐతే… జిల్లాల ఏర్పాటు జరగబోతోందని ఇప్పటికే కొంతమంది వైసీపీ మంత్రులు ఫీలర్స్ రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల ఈ మూడు జిల్లాల ఏర్పాటు జరగబోతోందని తెలిసింది. ఈ మూడే ఎందుకు అంటే… మచిలీపట్నం, అరకు, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమధ్య ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలంటే… రూ.600 కోట్ల దాకా ఖర్చవుతుంది.

బాగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే… వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)… ఇస్తుంది. అంటే… మొత్తం రూ.1800 కోట్లు అవుతుందనుకుంటే… MCI నుంచీ రూ.1080 కోట్లు వస్తాయి. ఫలితంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.720 కోట్లే అవుతుంది. అసలే ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. అప్పులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అందువల్ల పొదుపులు చేసేందుకు వీలయ్యే అన్ని మార్గాల్నీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో MCI నుంచీ మనీ పొందేందుకు ఆ మూడు ప్రాంతాల్నీ జిల్లాలుగా మార్చనున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతాల్ని జిల్లాలు చెయ్యాలనే డిమాండ్ ఆల్రెడీ ఉంది. అందువల్ల వాటిని చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేబినెట్‌లో చర్చించి… చేసేద్దామని అనుకున్నట్లు సమాచారం!

Related posts