కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారం అందించడానికి అక్షయ పాత్ర తరఫున యాంకర్ సుమ విరాళాలు సేకరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తాను ఇచ్చిన పిలుపుపట్ల ఇంతమంది స్పందించి విరాళాలు ఇచ్చినందుకుగానూ సుమ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు రూ.3,91,000 వచ్చాయి. మొత్తం 307 మంది ఈ విరాళాలు ఇచ్చారు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లో ఆమె అభిమానులతో మాట్లాడి విరాళాలు ఇవ్వాలని కోరింది. విరాళాల కోసం తాను ఇచ్చిన పిలుపునకు అభిమానులు బాగా స్పందించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఇది కన్నీరు కాదని ఆనంద బాష్పాలని ఆమె కళ్లు తుడుచుకుంటూ వ్యాఖ్యానించింది. విపత్కర సమయంలో తాము మాత్రమే బాగుండాలని అనుకోకుండా ఇతరుల ఆకలిని తీర్చుతున్నారని ప్రశంసించింది. మానవత్వం ఇంకా బతికే ఉందని చాలా మంది నిరూపిస్తున్నారని తెలిపింది. ఇంత మంది స్పందిస్తుండడం తన హృదయాన్ని కదలిస్తోందని ఆమె భావోద్వేగభరితంగా మాట్లాడింది.
previous post