క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్గా బన్నీ, అతని ప్రేయసి శ్రీ వల్లి పాత్రలో రష్మిక కనిపించనున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి’ పాటలు యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి. తాజాగా మేకర్స్ “పుష్ప: ది రైజ్” నుంచి థర్డ్ సింగిల్ ‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.
అద్భుతంగా ఉన్న లిరిక్స్, వాటికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయాయి. ఇక ఈ పాటకు మౌనిక యాదవ్ వాయిస్ సూపర్ గా కుదిరింది. చంద్రబోస్ సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.