దర్శకుడు సంపత్ నంది మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో “రచ్చ” వంటి కమర్షియల్ సినిమా చేశారు. ఆ తర్వాత ఆయనకు నిర్మాతగా, దర్శకుడిగా అసలు సక్సెస్ అనేదే లేకుండా పోయింది. నిర్మాతగా ఈయన చేసిన గాలిపటం, పేపర్ బాయ్, దర్శకుడిగా తెరకెక్కించిన బెంగాల్ టైగర్, గౌతమ్ నందా చిత్రాలు ప్లాప్ అయ్యాయి. తదుపరి సినిమాను సంపత్, గోపీచంద్తోనే చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయిందట. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్తో సినిమా చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ను కలిసి లైన్ చెప్పగా, ఆయన పూర్తి కథను సిద్ధం చేసుకు రమ్మని అన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ రామ్కు రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి పూర్తి కథ విన్న తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి.
previous post
మరో స్టార్ హీరోయిన్ కు లైంగిక వేధింపులు… తల్లినీ వదల్లేదుగా…