ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో గత నెలరోజులుగా కశ్మీర్ లోయ లో నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పంచాయతీ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖ అధికారులతోపాటు, కశ్మీర్ డివిజినల్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పూల్వామా, కశ్మీర్, జమ్మూ, లధాక్ ప్రాంతాల ప్రజలు కూడా ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు. అభివృద్ధి నిధులు కశ్మీర్లోని గ్రామ పంచాయతీలకు నేరుగా అందించడం, ఆ నిధులతో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యల పై ఈ సామావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షాతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోం సెక్రటరీ ఏకే భల్లా, అడిషనల్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్ పాల్గొన్నారు