telugu navyamedia
రాజకీయ

అమేథీలో రాహుల్‌కు గట్టి పోటీ ఇస్తున్న స్మృతి ఇరానీ

rahul gandhi to ap on 31st

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలైన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈసారి  అమేథీలో రాహుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాహుల్ కంటే స్మృతి ముందంజలో ఉన్నారు. రాహుల్‌పై 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో స్మృతి కొనసాగుతున్నారు. 

అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. అయితే, వయనాడ్‌లో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా భావిస్తుండగా, అమేథీలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్మృతిపై రాహుల్ గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాహుల్ 2.70 లక్షల ఓట్లు సాధించారు.

Related posts