telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాబు నిస్సహాయతలో కూడా అందరినీ బెదిరిస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అందరినీ బెదిరిస్తున్నారని చెబుతూ ట్వీట్ చేశారు.

‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు’ అని విజయసాయి ఎద్దేవా చేశారు. 

Related posts