ఏపీ సర్కార్ అనుసరిస్తున్న ఇసుక విధానంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతి నుండి బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరకుండా మధ్యలో తినేస్తున్నారని ఆరోపించారు. బల్క్ బుకింగ్ లో ఇసుకను దోచేస్తున్నారని అన్నారు.
దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి దోచేస్తున్న లక్షలాది టన్నుల ఇసుకదోపిడీపై సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ’ అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్ చేశారు.
ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్షలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని అన్నట్టు ఆ వార్తా పత్రికల్లో ఉంది. ఈ విషయంపై కలెక్టర్కు చెప్పినా ఉపయోగం లేదని చెప్పినట్లు పత్రికల్లో ఉంది.