విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇటీవల బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఎఫ్-2’ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ‘ఎఫ్-2’ కంటే మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఒరిజినల్ చిత్రంతో పోలిస్తే ఎఫ్ 3 ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు.
కాగా.. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా..సెట్లోకి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో సెట్ మొత్తం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. వెంకీ, వరుణ్లతో బన్నీ సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎఫ్-3’ టీమ్ కొన్ని ఫొటోలను సోషల్మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్లకు జోడీగా తమన్నా, మెహరీన్ సందడి చేయనున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.