telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్‌ హీరోతో పెద్ద స్కెచ్‌ వేసిన పూరి

yash

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే… సౌత్‌ నుంచి పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న యష్‌ ఇప్పుడు తన నెక్స్ట్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టాడు. యష్‌ హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమాను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తయ్యాక పూరి జగన్నాథ్‌ యష్‌తో పాన్‌ ఇండియా సినిమాను చేయాలనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవల యష్‌ను కలిసి స్క్రిప్ట్‌ను వినిపించడం, అది యష్‌కు నచ్చడం చకచకా జరిగిపోయాయట. ఈ మరి ఈ ప్రాజెక్ట్‌ ఎంత వరకు వర్క్‌ అవుట్‌ అవుతుందో చూడాలి.

Related posts